కుత్బుల్లాపూర్: జీడిమెట్ల బస్ డిపో వద్ద టిఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్లు, కండక్టర్ లను విధులకు హజరవాల్సిందిగా జీడిమెట్ల డిపో మేనేజర్ ఆదేశించడంతో సుమారు 200 మంది ఉద్యోగులు విధులకు హజరయ్యారు. అయితే, వీరికి పని కల్పించకుండా డిపోకే పరిమితం చేయడంతో కూర్చోవడానికి స్థలం లేక, బాత్రూంలు సరిపోకా ఇబ్బందులు పడుతున్నారు.
అందరూ ఒకేసారి డిపోకు రావడంతో సోషల్ డిస్టెన్స్ లేక ఇతర సౌకర్యాలు లేక బీపి, సుగర్ ఉన్నవారు, మహిళలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆర్టీసి ఉద్యోగులు తెలిపారు. అవసరం ఉన్న వారిని విధులకు పిలుస్తే భాగుండేదని, అందరిని ఒకేసారి డిపోకు రమ్మని పని కల్పించకపోవడం డిపో మేనేజర్ అవగాహన రాహిత్యం అని ఉద్యోగుల ఆరోపిస్తున్నారు. సీనియార్టీ ఆదారంగా అవసరం ఉన్నవారినే విధులకు పిలువాలని ఉద్యోగులు డిపో మేనేజర్ కు విజ్ఞప్తి చేశారు.
TSRTC Employees Concerns at Jeedimetla bus depot