ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటలు
అన్ని ప్రధాన రూట్లలో బస్సులు తిరుగుతాయి
ఈడీ వెంకటేశ్వర్లు
మన తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజుల పాటు సడలింపులతో కూడిన లాక్డౌన్ విధించిందని , ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో సిటీ బస్సులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరు బస్సులను నడపుతుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడి వెంకటేశ్వర్ల తెలిపారు. గతంలో మాదిరిగానే అన్ని రూట్లలో బస్సులను నడపనున్నట్లు ఆయన చెప్పారు. ప్రయాణికులు తమ అత్యవసర ప్రయోజనాల నిమిత్తం ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా బస్సాప్ కౌంటర్లు ఉదయం 6.30 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మెట్రో వేళల్లోనూ మార్పులు
హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించారు. ఉదయం 07 గంటల నుంచి సాయంత్రం 06 గంటల వరకు మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు కార్యాలయం ప్రకటించింది. అన్ని చివరి స్టేషన్ ల నుంచి సాయంత్రం 05 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని వెల్లడించింది.