Sunday, May 5, 2024

ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు

- Advertisement -
- Advertisement -

TTD release Sarva Darshan tokens on Online TodayTTD release Sarva Darshan tokens on Online Today

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 26,249 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం స్వామివారికి 12,944 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీకి రూ.2.15 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. ఈరోజు ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు. రేపటి నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లు విడుదల చేయనున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. రోజుకు 8వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.

TTD release Sarva Darshan tokens on Online Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News