Tuesday, May 14, 2024

నదిలో పడి ఇద్దరు సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

Two army mans dead fell into river at ladakh

ఢిల్లీ: ఇద్దరు భారత సైనికులు నదిలో పడి చనిపోయిన సంఘటన లడఖ్‌లో జరిగింది. శ్యోక్ నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా నాయక్ సచిన్ మోర్, లాన్స్ నాయక్ సలీం ఖాన్ వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించారు. లడఖ్‌లో చైనా సైనికుల దాడిలో 20 మంది భారత్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భారత్-చైనా బార్డర్ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో భారత్ తన బలగాలను భారీగా సరిహద్దులకు తరలిస్తోంది. లడఖ్‌లో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News