చెన్నై: భర్త చికెన్ బిర్యానీ తీసుకరాలేదని ఇల్లాలు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన తమిళనాడులోని మల్లప్పురంలో జరిగింది. పుంజేరి గ్రామంలో మనోహర్(32), సౌమ్య(28) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు(11), కుమారుడు(10) ఉన్నాడు. వీరి ఇంటికి సమీపంలో బిర్యానీ సెంటర్ను ప్రారంభించారు. ఒక్క బిర్యానీ పాకెట్ కొంటే ఒకటి ఫ్రీ అని రెస్టారెంట్ యజమాని ప్రకటించారు. బిర్యానీ కావాలని భర్తను భార్య అడగడంతో అతడు బిర్యానీ సెంటర్కు వెళ్లాడు. అక్కడ చికెన్ బిర్యానీ లేకపోవడంతో వెజ్ బిర్యానీ ఇంటికి తీసుకొని వచ్చాడు. కానీ తనకు చికెన్ బిర్యానీ కావాలని పట్టుబట్టింది. భార్య వెజ్ బిర్యానీ తీసుకోకపోవడంతో పక్కింటివాళ్లకు బిర్యాని ఇచ్చి భర్త పనికి వెళ్లాడు. ఆమె భవనంపైకి ఎక్కి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికెన్ బిర్యానీ తీసుకరాలేదని…. భార్య కిరోసిన్ పోసుకొని….
- Advertisement -
- Advertisement -
- Advertisement -