- Advertisement -
అమరావతి: అమ్మమ్మ మతిమరుపు ఇద్దరు బాలురు ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వడ్డిపల్లెలో జరిగింది. చికెన్ మసాలాకు బదులు గుళికల మందులు వేయడంతో అన్నం తిని ఇద్దరు మనవళ్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాంబాబు తన భార్య చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ కావడంతో అమ్మమ్మ వాళ్ల ఇంటికి రోహిత్ (12), జీవ(09) వెళ్లారు. ఇంటికొచ్చిన కుమారులకు కోడి కూర తీసుకొచ్చింది. కోడి కూరలో మసాలాకు బదులుగా గుళికలు మందు వేసింది. పిల్లలకు భోజనం పెట్టి తాను గోవిందమ్మ తిని వెంటనే కిందపడిపోయారు. గ్రామస్థులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో ఇద్దరు మనవళ్లు చనిపోయారు. ఆ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- Advertisement -