Saturday, April 27, 2024

బిస్కెట్లు తిని ఇద్దరు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: బిస్కెట్లు తిని తరువాత వాంతులు చేసుకొని ఇద్దరు పిల్లలు మృతి చెందిన సంఘటన ఆంధ్రపదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని చింతకొమ్మదిన్నె గ్రామంలో జరిగింది. అన్నా చెల్లెలు చనిపోవడంతో ఆ కుటంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అక్క పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… హుస్సేన్ బాషా, దిల్షాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ దుకాణంలో ఆ పిల్లలు తన బాబాయి కూతురుతో కలిసి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని టీలో కలుపుకొని తినగానే వారికి వాంతులు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో ఆరేళ్ల కుమారుడు మృతి చెందాడు. ఇద్దరు కూతుళ్లను ఆళ్లగడ్డ ఆస్పత్రి తరలించగా పరిస్థితి విషమించడంతో కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్న కూతురు కన్నుమూసింది. మరో కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆహారం విషమతుల్యం కావడంతో చిన్నారులు చనిపోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News