Friday, April 26, 2024

ఉప్పల్ లో విషాదం.. ఇద్దరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Two drivers burned alive containers caught fire

హైదరాబాద్:విద్యుదాఘాతంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైన సంఘటన నగరంలోని ఉప్పల్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన షహజాబ్(38) కంటైనర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన గంగా సాగర్(50) లోకల్ గైడ్‌గా ఉపాధి పొందుతున్నాడు. శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడిఏకు లారీ కంటైనర్‌లో కార్లను తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలో మోడ్రన్ బెడ్ ప్రాంతానికి రాగానే లారీ అదుపుతప్పి కరెండు స్తంభానికి ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు కంటైనర్‌పై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో చిక్కుకున్న ఇద్దరు సజీవదహనం అయ్యారు. కంటైనర్‌లోని కార్లు సైతం పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

Two drivers burned alive containers caught fire

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News