Monday, May 6, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in Road Accident At Siddipet District

సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్ మండలం జాలిగామలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జాలిగామ శివారులో బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను రాయపోలు మండలం కొత్తపల్లి చెందిన ఎర్రోళ్ల డేవిడ్(22), మంద ప్రసాద్(18)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాంలంటూ బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఘటనాస్థలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొవడంతో భారీగా పోలీసులు మోహరించారు.

Two killed in Road Accident At Siddipet District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News