- Advertisement -
సంగారెడ్డి: జిల్లాలోని పటాన్ చెరు మండలం ముత్తంగిలో ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కంటైనర్ ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రుద్రారానికి చెందిన రాజు, అంజనేయులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Two killed in Road accident in Muthangi
- Advertisement -