- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో 573 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 609 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,77,724కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,493 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 2,68,601 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 7,630 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్ లో 5,546 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 127 కరోనా కేసులు బయటపడ్డాయి.
573 New Covid-19 Cases Reported in Telangana
- Advertisement -