Saturday, May 4, 2024

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డిసిఎం: తండ్రీకొడుకులు మృతి

- Advertisement -
- Advertisement -

మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అఖిల డాబా వద్ద ద్విచక్రవాహనాన్ని డిసిఎం ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. బైక్ పై ఇద్దరు కుమారులతో తండ్రి మరికల్ నుంచి స్వగ్రామం చింతకుంటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో కుమారుడు మృతి చెందగా ఆస్పత్రి తరలిస్తుండగా తండ్రి కూడా చనిపోయాడు. మరో కుమారుడు స్వల్పగాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News