Friday, April 26, 2024

రోడ్డుప్రమాదంలో ఒగ్గు కళాకారులు మృతి

- Advertisement -
- Advertisement -

Two Oggu Katha Artists Death in Road Accident

సిరిసిల్ల: రెండు బైకులు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఒగ్గు కథ కళాకారులు మృతి చెందిన సంఘటన జిల్లాలోని గంభీరావుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. మృతులను ముస్తాబాద్ మండలానికి చెందిన దేవయ్య, ఆడవయ్యగా గుర్తించారు. ముస్తఫానగర్ లో ఒగ్గు కథ చెప్పి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ఇద్దరి బైకులు ఒకదానికొకటి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News