Monday, April 29, 2024

విషాదం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ లోని ఖేరగడ్ బ్లాక్‌లో కర్హకి గ్రామంలో పూరిల్లు దగ్ధమై చిన్నారులైన ఇద్దరు అక్కచెల్లెళ్లు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని పోలీస్‌లు చెప్పారు. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉన్నారు. మూడేళ్ల కనక్, ఐదేళ్ల వీనేష్ అక్క చెల్లెళ్లతోపాటు వారి చిన్నారి ఆర్నెలల తమ్ముడు అలోక్ ఇంటి మొదటి అంతస్తులో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

దీనిపైకప్పు పూరిల్లు కావడంతో విద్యుత్ షార్ట్ సర్కూట్‌కు అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సునీల్ కుమార్ చెప్పారు. ప్రమాదం జరిగేటప్పుడు వారి తండ్రి ఇంట్లో లేరు. మరో ఇద్దరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు. తల్లి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంది. పిల్లలను రక్షించే ప్రయత్నంలో ఆమె తీవ్రంగా గాయపడింది. సంఘటన తరువాత స్పృహ తప్పి పోయింది. ఇరుగుపొరుగువారు వెంటనే వచ్చి అలోక్‌ను రక్షించగలిగినా అక్కచెల్లెళ్లను మాత్రం కాపాడ లేక పోయారు. ఆరు నెలల పసివాడు, తల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News