Monday, April 29, 2024

శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

Two terrorists killed in Srinagar

 

శ్రీనగర్: సోమవారం శ్రీనగర్‌లోని ఓల్డ్ బర్జుల్లా ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన లష్కర్ కమాండర్ సైఫుల్లాగా గుర్తించామని జమ్మూకాశ్మీర్ డిజిపి దిల్బాగ్‌సింగ్ తెలిపారు. సైఫుల్లాకు పలు హింసాత్మక ఘటనలతో సంబంధమున్నదని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు శ్రీనగర్‌లో ఎనిమిది ఎన్‌కౌంటర్లు జరగగా, వాటిలో మొత్తం 18మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News