- Advertisement -
హైదరాబాద్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఉగాది పంచాంగాన్ని పఠించారు. ఈ సంవత్సరం రాష్ర్టానికి అంతా మంచే జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.వి.రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Ugadi Celebrations of Sri Sharwari Nama Year
- Advertisement -