Thursday, May 9, 2024

యుకెలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు..

- Advertisement -
- Advertisement -

లండన్: యుకెలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.  ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఓ వ్యక్తి చనిపోయినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఇటీవల ఈ వేరియంట్ సోకినవారిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయవొద్దని, చాలా జాగ్రత్తగా ఉండాలని బోరిస్ హెచ్చరించారు. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ యుకెలో వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ను అడ్డుకునేందుకు యుకె ప్రభుత్వం బూస్టర్ డోస్ పంపిణీ కార్యాక్రమాని చేపట్టింది. మరోవైపు ఇండియాలోనూ ఈ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

UK Reports first Omicron Death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News