- Advertisement -
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి నూతన సభ్య దేశాలైన భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో,నార్వేలను సాదరంగా ఆహ్వానించారు. భద్రతా మండలిలో ఈ ఐదు దేశాలకు రెండేళ్లపాటు సభ్యత్వం ఉంటుంది. భద్రతామండలి ఏర్పడిననాటి నుంచి భారత్ ఎనిమిదోసారి సభ్యదేశంగా ఎన్నికైంది. సోమవారం(అమెరికా కాలమాణం ప్రకారం) సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఈ ఐదు దేశాల జెండాలను ప్రదర్శించారు. యుఎన్లో శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి మూడు రంగుల జెండాను ఎగురవేశారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్ బోజ్కిర్ నూతన సభ్యదేశాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేశారు.
UN Member States welcome India to UNSC
- Advertisement -