Tuesday, May 21, 2024

హత్రాస్ బాధిత కుటుంబానికి పటిష్ట భద్రత..

- Advertisement -
- Advertisement -

లక్నో: హత్రాస్ బాధితురాలి కుటుంబానికి భద్రత మరింత పటిష్టం చేశారు. మృతురాలి సోదరునికి ఇద్దరు సాయుధ అంగరక్షకుల భద్రత కల్పించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. బాధితురాలి ఇంటి చుట్టూ భద్రత ఏర్పాటు చేశామని, కుటుంబ సభ్యులకు కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని అదనపు చీఫ్ సెక్రటరీ (హోమ్) అవనీష్ కుమార్ అవస్థి చెప్పారు. ఆ గ్రామంలో కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు 1215 పిఎసి సిబ్బందిని మహిళా పోలీసులను, కానిస్టేబుళ్లతోపాటు ముగ్గురు ఎస్‌హెచ్‌ఒలు, డిప్యూటీ ఎస్‌పి ర్యాంకు అధికారిని కూడా నియమించామని హత్రాస్ పోలీసులు తెలిపారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మెజిస్ట్రేట్‌లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

UP Govt provide Security to Hathras Victim’s Family

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News