- Advertisement -
లక్నో: కరోనా వైరస్ ధాటికి మరో మంత్రి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి కశ్యప్ (56) కరోనా వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. శరత్వాల్ నియోజకవర్గం నుంచి మంత్రిగా పని చేశారు. యుపి మంత్రులలో గత సంవత్సరం కమల్ రాణి, చేతన్ చౌహాన్ కరోనాతో మృతి చెందారు. ఇతను మూడో మంత్రి కావడం గమనార్హం కశ్యప్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 16.37లక్షలకు చేరుకోగా 18వేల మంది చనిపోయారు. మంగళవారం ఒక్క రోజే 8737 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 255 మంది మృత్యువాతపడ్డారు.
- Advertisement -