Sunday, May 19, 2024

మొండెం చేనులో… తల బావిలో…

- Advertisement -
- Advertisement -

bjp kisan morcha leader dead body found in forest

 

లక్నో: ఓ మహిళను చంపి మొండాన్ని చేనులో పడేసి… తలను బావిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్, ఘజిపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహిళను చంపిన మూడు రోజుల తరువాత ఆమె మొండాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె జీన్స్ పాయింట్ జేబులో ఉన్న ఫోన్ నంబర్ ద్వారా ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించారు. బండ ప్రాంతానికి చెందిన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా హత్యకు సంబంధించిన వివరాలు తెలిశాయి. రాయ్ బరేలీ చెందిన మహిళ తన దగ్గర బంధువు భోళా పండిట్‌తో కలిసి పారిపోయింది. భోళా ఆమెను సర్వాల్ గ్రామానికి తీసుకొచ్చి నరికి చంపాడు. ఆమె మృతదేహం నుంచి తలను వేరు చేశాడు. మొండాన్ని సర్వాల్ గ్రామ శివారులోని ఓ చేనులో పడేశాడు. ఆమె తలను మాత్రం శేవ్రామౌ గ్రామంలోని ఓ బావిలో పడేశాడు. ప్రస్తుతం భోళా పండిట్ పరారీలో ఉండడంలో ఎందుకు చంపాడనే విషయం వెలుగులోకి రాలేదు. స్థానిక పోలీస్ అధికారి వినోద్ మిశ్రా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సహకరించిన భోళాతో నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News