Monday, May 6, 2024

భర్తను గన్‌తో కాల్చి.. భార్య ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Woman shoots husband dead after suicide attempt

లక్నో: ఓ మహిళ తన భర్తను గన్‌తో కాల్చిన చంపిన అనంతరం తాను ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దక్షిణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్వాడీ ప్రాంతంలో పురన్ సింగ్ యాదవ్(45), కుశ్మా దేవీ అనే దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కుశ్మా దేవీ తన భర్తను గన్‌తో కాల్చి చంపింది. అనంతరం తనకు తానుగా కాల్చుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌పి అజయ్ కుమార్ పాండే ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News