Friday, April 26, 2024

పట్టణ ప్రగతితో పట్టణాల్లో సమూల మార్పులు: సబితా

- Advertisement -
- Advertisement -

Urban areas developed with Pattana pragathi

రంగారెడ్డి: సిఎం కెసిఆర్ ప్రారంభించిన పట్టణ ప్రగతితో పట్టణాల్లో సమూల మార్పులు జరిగాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తుక్కుగూడలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారంచుట్టారు. పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేశామన్నారు. తుక్కుగూడలో రూ.4 కోట్ల 50 లక్షలతో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేశామని వివరించారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో మూడు ఎకరాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో పచ్చదనం కోసం పూర్తి బడ్జెట్‌లో పది శాతం గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించామని సబితా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News