- Advertisement -
న్యూఢిల్లీ: లోక్ సభ సెక్రటరీ జనరల్గా సీనియర్ ఐఎఎస్ అధికారి ఉత్పల్ కుమార్ సింగ్ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం నియమించారు. ఉత్తరాఖండ్ క్యాడర్కు చెందిన 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ఉత్పల్ కుమార్ డిసెంబర్ 1న పదవీ బాధ్యతలు చేపడతారు. స్నేహలత శ్రీవాస్తవ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన లోక్సభ సచివాలయంలో సెక్రటరీ పదవిలో ఉన్నారు. గడచిన 34 సంవత్సరాలుగా ఉత్పల్ కమార్ కేంద్ర, రాష్ట్రాలలో అనేక కీలక పదవులను నిర్వహించినట్లు లోక్ సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీగా ఆయన చెండున్నరేళ్లు పనిచేశారు. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖలో అదనపు కార్యదర్శగా కూడా ఆయన గతంలో పనిచేశారు.
- Advertisement -