Saturday, May 4, 2024

అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వాహనం సీజ్: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

 

రంగారెడ్డి: అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో సైబరాబాద్ సిపి సజ్జనార్ వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని, నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారికి మూడు కిలో మీటర్ల లోపు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రోడ్లపైకి వచ్చే వాహనదారులు హెల్మెట్, లైసెన్స్, ఆధార్ కార్డు కూడా తీసుకురావాలని కోరారు. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేసినా ప్రజలు సహకరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News