Wednesday, May 1, 2024

ప్రముఖ గాంధేయ వాది ఎస్‌ఎన్ సుబ్బారావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Veteran Gandhian Subbarao passes away

జైపూర్ : ప్రముఖ గాంధేయవాది ఎస్‌ఎన్ సుబ్బారావు జైపూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 92 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన జైపూర్ లోని సవాయి మాన్‌సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి వినోబా గ్యాన్ మందిర్‌కు తరలించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్, పిసిసి అధ్యక్షుడు గోవింద్‌సింగ్ దోటస్రా ఇతర నేతలు, ప్రముఖులు సుబ్బారావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మధ్యప్రదేశ్ లోని జౌర గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. జౌర గ్రామంలో సుబ్బారావు మహాత్మాగాంధీ సేవాశ్రమాన్ని నెలకొల్పారు. సుబ్బారావుతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గెహ్లాట్ గుర్తు చేసుకుని సంతాపం ప్రకటించారు. యువతకు ఆయన స్పూర్తి ప్రదాతని, ఆయన ఎన్నో యువజన కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News