Sunday, April 28, 2024

మరోసారి కలిసి నటిస్తారట

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లోకి ‘ఛలో’ చిత్రంతో మెరుపులా వచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆమె చేసిన గీత గోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది ఈ భామ. దీంతో పాటు తమిళ్ లో ‘సుల్తాన్’, కన్నడలో ‘పొగరు’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోందీ ఈ లక్కీ బ్యూటీ. అయితే ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని సమాచారం.

కాగా విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఒకటి మంచి విజయాన్ని సాధించగా మరొకటి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఇప్పుడు ఈ జోడీ మరోసారి కలిసి నటించబోతుందట. కాకపోతే ఈసారి సినిమాలో కాకుండా ఓ యాడ్ కోసం కలుస్తున్నారట. ఒక దుస్తుల బ్రాండ్ యాడ్ కోసం విజయ్‌తో కలిసి రష్మిక నటిస్త్తుందట. అయితే ఈ బ్రాండ్‌కి ఈ బ్యూటీని విజయ దేవరకొండనే సిఫార్స్ చేశారని టాక్ వినిపిస్తోంది.

Vijay devarakonda and Rashmika to work together in Ad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News