సిద్దిపేట: విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరికి అన్నింటా శుభం చేకూరాలని.. తెలంగాణా ప్రజల జీవితం లో దసరాను మించిన పండుగ లేదన్నారు. దసరా పండుగలో మన సాంప్రదాయం, సంస్కృతితో పాటూ ఆత్మీయత ఉందని, ఈ పర్వదినాన్ని ప్రజలందురు సుఖసంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిసించారు. చెడు మీద మంచి విజయం సాధించే రోజు విజయ దశమి అని పాలపిట్టను చూస్తే శుభం కలిగినట్టే తెలంగాణా ప్రజలకు శుభం కలగాలన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందని హరీష్ రావు ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం , అభివృద్ధి దిశగా ప్రభుత్వం అన్నింటా మరిన్ని విజయాలు సాధించాలని, ఈ పర్వదినాన ఆ దుర్గ అమ్మవారిని వేడుకుంటున్న దసరా పండుగ జిల్లాలో ప్రజలకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నారు.
విజయ దశమి శుభాకాంక్షలు: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -