నాలుగేళ్లలో మూడో సారి ప్రకటించిన సంస్థ
ముంబయి : అతి పెద్ద వాహనతయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ తమ ఉద్యోగులకు చేదువార్త అందించింది. అమ్మకాలు లేక, ఆదాయాలు క్షీణించి ఇబ్బంది పడుతున్న సంస్థ టర్నరౌండ్ ప్రణాళిక, ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్)ప్రకటించింది. దాదాపు 42,597 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సగం మంది విఆర్ఎస్కు అర్హులని తాజా అంచనా ద్వారా తెలుస్తోంది. టాటా మోటార్స్ నాలుగేళ్లలో మూడో సారి విఆర్ఎస్ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. తాజా ప్రకటన ప్రకారం అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం సంస్థలో పని చేసిన వారు విఆర్ఎస్కు అర్హులు. ఉద్యోగి వయసు, వారి సర్వీసు ఆధారంగా పరిహారాన్ని లెక్కించనున్నారు. అర్హత కలిగిన ఉద్యోగులు డిసెంబర్ 11వ తేదీనుంచి జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.