Wednesday, May 15, 2024

బిఆర్‌ఎస్ మేనిఫెస్టోతో వార్ వన్ సైడ్.. వంద సీట్లు పక్కా

- Advertisement -
- Advertisement -

ఎన్నారై బిఆర్‌ఎస్ యూకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్‌ఎస్ మేనిఫెస్టో తో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బిఆర్‌ఎస్ యూకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచి అని 100 సీట్లతో మూడోసారి అధికారంలోకి రాబోతుందని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలందరికి ఒక భరోసా.. ఒక అండ అని ఖండాంతరాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులందరు బిఆర్‌ఎస్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోపై హర్షం వక్తం చేసారని అశోక్ గౌడ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యమ నాయకులే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, తెలంగాణ ప్రజలకి ఏం కావాలో సిఎం కెసిఆర్‌కు తెలుసన్నారు.

2014, 2018 ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన అంశాలే కాకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్నో కొత్త పథకాలు బిఆర్‌ఎస్ పార్టీ తీసుకొచ్చిందని ఆయన గుర్తుచేసారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఎలక్షన్స్ కన్నా తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ముఖ్య మన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నారై బిఆర్‌ఎస్ యూకె రాష్ట్రమంతటా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తుందని తెలియజేసారు. సిఎం కెసిఆర్‌ని 100 సీట్లతో గెలిపించుకుంటామని అశోక్ గౌడ్ ధీమా వక్తం చేసారు. ఇప్పటికీ ఎన్నారై బిఆర్‌ఎస్ యూకె  సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తుందని, రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఉదృతంగా ప్రచారం నిర్వహిస్తుందని అశోక్ తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News