Wednesday, May 1, 2024

పెరుగుతున్న పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు

- Advertisement -
- Advertisement -

Wedding registrations rising in telangana

గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరిగిన అవగాహన
మొదటిస్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి
రెండోస్థానంలో హైదరాబాద్

మన తెలంగాణ/హైదరాబాద్: ఐదు సంవత్సరాలుగా రిజిస్ట్రర్ మ్యారేజీ పట్ల గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. చాలామంది తమ వివాహాన్ని చట్టపరంగా ధ్రువీకరించుకుంటున్నారు. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో చాలా వరకు పెళ్లిళ్లు సంప్రదాయం ప్రకారం జరుగుతుంటాయి. కుటుంబ పెద్దలు,  బంధుమిత్రుల సమక్షంలో జంటలు ఒక్కటవుతుంటారు. హిందూ వివాహ చట్టం ప్రకారం వీటికి చట్టబద్ధత ఉన్నప్పటికీ ఏదైనా ప్రభుత్వ పథకాలు, వీసా, రిజిస్ట్రేషన్లు, తదితర పనుల కోసం చట్టపరమైన ధృవీకరణ (రిజిస్ట్రేషన్ మ్యారేజ్) తప్పనిసరి అయ్యింది. రిజిస్ట్రర్ మ్యారేజీల పరంగా గతంలో హైదరాబాద్ టాప్‌లో ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ రిజిస్ట్రర్ మ్యారేజీల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. ముఖ్యంగా శివారు గ్రామాల్లో మ్యారేజీ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వివాహ రిజిస్ట్రేషన్లలో నెంబర్‌వన్‌గా నిలవగా తరువాత స్థానంలో హైదరాబాద్ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,22,776 పెళ్లిళ్లు రిజిస్ట్రర్ అయ్యాయని అధికారులు తెలిపారు.

నగర శివార్లలోరిజిస్ట్రేషన్ల పట్ల ఆసక్తి

జిల్లాల పునర్విభజనలో భాగ ంగా శివారు ప్రాంతాల్లోని చాలా గ్రామాలు మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లాలో కలిపివేశారు. ఈ జిల్లా పరిధిలోని, ముఖ్యంగా నగర శివార్లలోని ప్రజలు వివా హ రిజిస్ట్రేషన్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మ్యారేజీ రిజిస్ట్రేషన్లను గమనిస్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోనే ఎక్కువగా రిజిస్ట్రర్ అయ్యాయి. 2020 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 97,149 జంటలు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో 12,174 మ్యారేజీలు రిజిస్ట్రేషన్‌లయ్యాయి. అయితే, ఈ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు పెర గడానికి కారణం ప్రభుత్వ పథకాలేనని, ముఖ్యంగా కళ్యాణలక్ష్మి పథకం లాంటి వల్లే ప్రజల్లో దీనిపై అవగాహన పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందాలంటే ప్రభుత్వ అధికారుల ధ్రువీకరణ తప్పనిసరి. అలాగే, విదేశాలకు వెళ్లేందుకు, వీసా పొందడానికి, ఇతర రిజిస్ట్రేషన్లకు వివాహ ధృవీకరణ తప్పనిసరి. ఈ కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ వివాహ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

           జిల్లా                          రిజిస్ట్రేషన్లు
1. మేడ్చల్ మల్కాజిగిరి               – 44,345
2. హైదరాబాద్                         – 42,189,
3. రంగారెడ్డి                             – 36,242
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News