Monday, May 6, 2024

పంజాగుట్ట బాలిక ఆచూకీ తెలియలేదు

- Advertisement -
- Advertisement -

whereabouts of the Panjagutta girl are not known

అనుమానస్పదస్థితిలో మృతిచెందిన బాలిక
ఉస్మానియాలో బాలిక మృతదేహం
వివరాల కోసం విచారణ చేస్తున్న పంజాగుట్ట పోలీసులు

హైదరాబాద్ : అనుమానస్పదస్థితిలో మృతిచెందిన బాలిక వివరాలు ఇంకా తెలియలేదు. గుర్తుతెలియని బాలిక మృతదేహం వెంగల్‌రావు పార్కు సమీపంలోని మిడ్‌టౌన్ బిల్డింగ్ వద్ద పడి ఉంది స్థానికులు గురువారం ఉదయం గమనించి డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక వయస్సు 4 నుంచి 5 ఏళ్లు ఉంటాయని నిర్ధారించారు. నిబంధనల ప్రకారం రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు అనుమానస్పదస్థితి మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. ఎక్కడో చంపి ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అనారోగ్యంతో బాలిక మృతిచెందితే ఇక్కడ పడేశారా లేక అమావాస్య రోజు క్షుద్రపూజలు చేసి బాలిక హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలిక ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. బాలిక ఎవరూ అనేతి తెలిస్తే మిస్టరీ వీడే అవకాశం ఉంది. బాలిక మృతదేహాన్ని అక్కడ పడేసిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాలికల మిస్సింగ్ కేసులను తెప్పించుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాలిక ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాల్సిందిగా ఫొటో, పంజగుట్ట ఇన్స్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి మొబైల్ నంబర్ 9490616610, డిఐ కందిమళ్ల నాగయ్య 949061660613, ఎస్సై సతీష్ 9490616365కు ఫోన్ చేయాల్సింది కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News