Sunday, May 5, 2024

బావ బైక్ పై వచ్చిన భార్య… మందలించిన భర్త… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కర్నూలు: భార్యను భర్త, బంధువులు మందలించారనే బాధతో సదరు మహిళ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలులోని శ్రీశైలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీశైలంలో శ్రావణిని నాగయ్య 2014లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రావణిని బంధువుల పెళ్లికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వరసకు బావ అయ్య వ్యక్తి బైక్‌పై ఇంటికి వచ్చింది. దీంతో ఆమెను బంధువులు, భర్త మందలించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన శ్రావణి సారంగధర మకం వద్ద గల బావిలో తన పిల్లలతో కలిసి దూకింది. నాగయ్య తన భార్య పిల్లల కోసం ఎంత వెతికినా కనిపించలేదు. బావిలో మృతదేహాలు తెలియాడుతూ కనిపించడంతో స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News