- Advertisement -
విజయవాడ: మొదటి భర్త మోసం చేయడంతో ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆమెతో స్నేహంగా ఉంటూ ఆమె దగ్గర ఉన్న నగలు డబ్బులు కాజేయాలని ప్లాన్ వేశాడు. తన భార్యకు విడాకులు ఇచ్చానని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్య, బావమరిది, అతడి తల్లితో కలిసి రెండో భార్య స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. 20 లక్షల రూపాయలు ఇస్తే వీడియోలు ఇస్తామని ఆమెకు తెలిపాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి మరో ఆరు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
- Advertisement -