Saturday, April 27, 2024

మహిళ దారుణ హత్య…

- Advertisement -
- Advertisement -

Woman brutally murdered in Bommanapalli

 

మనతెలంగాణ/చిగురుమామిడి : వివాహాం అయిన రెండు నెలలకే నవ వధువు దారుణకు హత్యకు గురైన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే పోలీసుల, గ్రామస్థుల కథనం మేరకు ప్రాథమిక వివారాలు ఇలా ఉన్నాయి. బొమ్మనపెల్లి గ్రామానికి చెందిన మ్యాదర అనిల్(26), హుజురాబాద్‌కు చెందిన ప్రణాళిక(21)ని రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. భర్త అనిల్ హుస్నాబాద్‌లో వాహనాల బ్యాటరీ శాప్ నడిపిస్తున్నాడు. బిటెక్ పూర్తి చేసిన ప్రణాళిక ఇంటి వద్ద ఉంటుంది, అత్త, మామలు పొలం పనులకు వెళ్లటంతో ఇంటివద్ద ఒక్కతే ఉన్నట్లు సమాచారం.

మధ్యాహ్నాం ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రణాళికను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ సీపీ కమలాహసన్ రెడ్డి, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథీ, తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై చల్లా మధుకర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకోని అన్ని కోణాల్లో భర్తను, అత్త మామాను, తల్లి తండ్రులను వివారాలు అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే నిందుతులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్‌తో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News