Sunday, May 5, 2024

మహిళను పెట్రోల్ పోసి తగులపెట్టారు: శంషాబాద్ ఎసిపి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి:శంషాబాద్ లోని సాయి ఎన్ క్లేవ్ లో వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళ హత్యకు సంబంధించిన వివరాలను ఎసిపి రామ్ చందర్ రావు వెల్లడించారు.

“మహిళ మృతదేహం కాలిపోతుందని అర్థరాత్రి సమాచారం వచ్చింది. వెంటనే ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించాం. గుర్తుతెలియని మహిళను పోట్రోల్ పోసి తగులపెట్టారు. పోస్టుమార్టం తర్వాతే మహిళను ఎలా హత్య చేశారో తెలుస్తుంది. చనిపోయిన మహిళ ఎవరనే వివరాలు సేకరిస్తున్నాం. చుట్టుప్రక్కల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నాం. నిందితుడిని గుర్తించేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేశాం. ఘటనాస్థలం చుట్టు ప్రక్కల సిసి కెమెరాలను పరిశీలిస్తున్నాం” అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News