Thursday, May 16, 2024

నాలాలో పడి మహిళ గల్లంతు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నలాలో పడి మహిళ గల్లంతైన సంఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్యనగర్‌కు చెందిన లక్ష్మి(55) నాలాపై ఇల్లు నిర్మించుకుంది. నలా పక్కన నిర్మించుకున్న ఇంటికి హుస్సేన్ సాగర్ నాలా వైపు గోడను నిర్మించుకుంది. ఇది వర్షాలకు రెండేళ్ల క్రితం కూలిపోయింది. దానిని తిరిగి నిర్మించుకునేందుకు జిహెచ్‌ఎంసి అధికారులను సంప్రదించగా తాము దానిని నిర్మిస్తామని చెప్పడంతో అలాగే వదిలేసింది. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో హుస్సేన్‌సాగర్ నాలా పొంగిపోర్లుతోంది.

సోమవారం ఉదయం ఇంట్లోకి వెళ్లిన మహిళ ఇంటి వెనుకకు వెళ్లింది. అక్కడి నుంచి మహిళ కన్పించకుండా పోయింది. నాలా వైపు మహిళ గాజులు పగిలి ఉండడంతో తమ తల్లి నాలాలో పడి కోట్టుకుపోయి ఉండవచ్చని కూతురు అనుమానిస్తున్నారు. ఈ విషయం చెప్పడంతో జిహెచ్‌ఎంసి, డిఆర్‌ఎఫ్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి మహిళ కోసం వెతుకుతున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు మహిళ ఆచూకీ లభించలేదు. మహిళా నాలాలో పడిందా లేక ఎక్కడికైనా చెప్పకుండా వెళ్లిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News