లక్నో: కరోనా వైరస్ సోకిన భర్త మృతదేహంతో ఓ మహిళ ఆరు గంటలు ప్రయాణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో లక్నో రైల్వే స్టేషన్లో జరిగింది. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 200 మందిని హోం క్వారంటైన్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యుపిలో ఆయోద్యకు చెందిన వినోద్ కుమార్ ఉపాధ్యాయ్ ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియాలో ఫొటోగ్రాఫర్గా పని చేసేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో ముంబయిలో ఉన్నాడు. శ్రామిక్ రైలులో తన భార్యతో కలిసి వినోద్ ఉత్తర ప్రదేశ్కు వెళ్తున్నాడు. ఓరాయ్ నుంచి లక్నో వెళ్తున్నప్పుడు భర్త నిద్రపోయాడు. లక్నో రైల్వే స్టేషన్ వచ్చినా కూడా ఎంతకు నిద్ర నుంచి లేవకపోవడంతో రైల్వే అధికారులకు భార్య సమాచారం ఇచ్చింది. వినోద్ ను పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయాడని వెల్లడించారు. అతడికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. అతడితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 200 మందిని 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ చేయాలని ఆర్పిఎఫ్ అధికారి డికె రాణా తెలిపాడు.
కరోనా… భర్త మృతదేహంతో భార్య 6 గంటలు ప్రయాణం….
- Advertisement -
- Advertisement -
- Advertisement -