Monday, April 29, 2024

మెట్రోలో అరాచకాలు.. టూ పీస్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన యువతి (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో రైల్ లో వరస అరాచకాలు బయటపడుతున్నాయి. కొందరు పబ్లిక్ గా సభ్యత వదిలేసి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కొందరు యువతీయువకులు మెట్రో పరువు మంటగలుపుతున్నారు. తాజాగా ఓ యువతి టూ పీస్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. వీడియోలో ఒక మహిళ ఒక కోచ్‌లో ఇతర మహిళల పక్కన కూర్చొని నిలబడి నడవడానికి ముందు, ఆమె బికినీ దుస్తులను బహిర్గతం చేస్తుంది.

గతంలో లవర్స్ పబ్లిగ్ ముద్దు పెట్టుకున్న ఘటనలు వెలుగుచూశాయి. మెట్రోలో ఇలాంటి ఘటనలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక నిబంధనలు, మర్యాదలను ఉల్లంఘించినందుకు మహిళపై చర్య తీసుకోవాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ఇతర ప్రయాణీకులను కించపరిచే దుస్తులు ధరించకుండా ఉండాలని ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News