Saturday, April 27, 2024

బస్సును ఢీకొట్టిన లారీ: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Women dead in Lorry collided bus

అమరావతి: ఆర్‌టిసి బస్సు లారీని ఢీకొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పల్లెవెలుగు బస్సు ఆత్మకూరు నుంచి నెల్లూరు వెళ్తుండగా దామరమడుగు మఠం వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా 34 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రోడ్డు పైనుంచి 15 అడుగుల లోతులో పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీస్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News