షార్జా: మహిళల టి20 ఛాలెంజ్ 2020లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సత్తా చాటాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నొవాస్ జట్టు ఇప్పటికే రెండసార్లు టైటిళ్లను గెలిచుకుంది.ఇప్పడు హ్యాట్రిక్పై కన్నేసింది. కాగా, ఈ రెండు జట్లతోపాటు స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు కూడా ఈ సీజన్ లో సత్తా చాటాలని భావిస్తోంది.ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్ 9న జరిగే ఫైనల్లో ఆమీతూమీ తేల్చుకోనున్నాయి.
Women’s T20 Challenge: Velocity Opt bowl against Novas