- Advertisement -
సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా మెల్ బోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. భీకర ఫామ్ లో ఉన్న భారత ఓపెనర్ షఫాలీ వర్మ(2) టైటిల్ పోరులో నిరాశపర్చింది. తర్వాత త్యాగి భాటియా(2) రిటైర్డ్ ఔట్ గా మైదానాన్ని వీడింది. జట్టును ఆదుకుంటారనుకున్న మరో ఓపెనర్ స్మృతి మంధాన(11), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(4)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం భారత్ 5 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. క్రీజులో దీప్తి శర్మ(9), వేదా కృష్ణమూర్తి(0)లు ఉన్నారు.
Womens T20 World Cup Final: India Womens lost 4 wickets
- Advertisement -