హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చడంతో వివిధ పార్టీల నుంచి వంద మంది కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలం సికింద్రాపూర్, ముచ్కూర్ గ్రామం, వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామాల నుంచి బిజెపి, కాంగ్రెస్, బిఎస్ పి పార్టీల నుంచి 100 మంది నాయకులు కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
- Advertisement -