Sunday, April 28, 2024

వైసిపి ఎంపిలు రాజీనామా చేయాల్సిందే: బాబు

- Advertisement -
- Advertisement -

YCP MPs should be resigned

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైసిపి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. 25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామన్నారని, ప్రత్యేక హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వైసిపి ఎంపిలు రాజీనామా చేయాలని బాబు డిమాండ్ చేశారు. టిడిపి ఎంపిలు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విశాఖ రైల్వే జోన్‌ను విస్మరించారని, విశాఖ రైల్వే జోన్ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి సభలో చెప్పినా వైసిపి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని బాబు దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును కూడా కాపాడలేకపోతున్నారని, ఎపి ప్రజల సెంటిమెంట్ విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News