Wednesday, May 1, 2024

పాతబస్తీలో యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

young man brutally murdered in hyderabad

హైదరాబాద్: ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన నగరంలోని పాతబస్తీలోని ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. గుల్జార్ నగర్‌కు చెందిన మహ్మద్ అబ్బాస్(23) వృత్తిరీత్యా ఎలక్ట్రిషీయన్. శుక్రవారం రాత్రి అబ్బాస్‌కు తెలిసిన వారు ఫోన్ చేసి ఇంటి నుంచి బయటికి రావాలని పిలిచారు. దీంతో అబ్బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చి వారు రమ్మని చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వారు అబ్బాస్‌తో ఆర్థిక లావాదేవీల విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు ఆవేశంతో అబ్బాస్‌ను కత్తులతో పొడిచి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అబ్బాస్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పర్వేజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎసిపి ఎంఎ మజీద్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News