మేడ్చల్: దీపావళి పండుగను సంబరంగా జరుపుకున్నాడు.. అదే ఇంటి సభ్యులను శోకసంద్రంలో ముంచాడు. బాణసంచా కాల్చిన కుమారుడు లేడని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కెపిహెచ్బి కాలనీలో దుర్గా ప్రసాద్(21) అనే వ్యక్తి కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం తండ్రి చనిపోవడంతో ఆంధ్ర నుంచి వలస వచ్చి హైదరాబాద్లో నివసిస్తున్నారు. ప్రసాద్ తల్లి హౌస్ కీపర్గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చిన కుమారుడు బయటకు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఇంట్లో కిటికీకి ఉరేసుకొని వేలాడుతున్నట్టు మృతి దేహం కనిపించింది. వెంటనే పోలీసులు ఇంటి డోర్ తట్టి, రూమ్లోకి వెళ్లి చూడా ప్రసాద్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పండుగ చేసుకున్నాడు…. శోకసంద్రంలో ముంచాడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -