- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు చనిపోయారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.57 లక్షలకు చేరుకోగా 1407 మంది మృత్యువాతపడ్డారని తెలిపింది. కరోనా నుంచి 2.42 లక్షల మంది కోలుకోగా 14 వేల మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. గత 24 గంటల్లో 17 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 48.7 లక్షలకు చేరుకుంది.
- Advertisement -