Saturday, April 27, 2024

కుటుంబ కలహాలు…. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young man commit suicide in karimnagar

కరీంనగర్: ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మానకొండూర్ మండలం వెల్డీ గ్రామానికి చెందిన కనకం వంశీ అనే యువకుడు (వయసు 22) తన తండ్రితో గొడవ పడి తన సొంత గ్రామం వదిలి కరీంనగర్ పట్టణంలో నివసించడానికి తన తల్లి, తమ్ముడితో కలిసి మూడు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. వచ్చేముందు తన తండ్రి శంకరయ్య తో గొడవపడి కరీంనగర్ కి వచ్చి గోదాం గడ్డలో ఇల్లు కిరాయి తీసుకుని ఉంటున్నాడు. బిటెక్ చదివిన యువకుడు గతంలో కరీంనగర్ ఐటి కాంట్రాక్టు లో ఉద్యోగం చేస్తున్నాడు. శాలరీ నచ్చక ఉద్యోగం వదిలేసి మరో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో కుటుంబ కలహాలతో గొడవపడి ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కరీంనగర్ టూ పెద్దపల్లి రైల్వే జంక్షన్ మధ్యలో కరీంనగర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో బొమ్మకళ్లు – గుంటూరు పల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చనిపోయే ముందు తన తమ్ముడికి ఫోన్ చేసి వివరాలు తెలిపాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం రెండు భాగాలుగా చీలిపోయి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News