Monday, April 29, 2024

కైకాల సత్యనారాయణను పరామర్శించిన చిరంజీవి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఆయన స్పృహలోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వైద్యుల సాయంతో ఫోన్‌లో కైకాల సత్యనారాయణను మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ”కైకాల స్పృహలోకి వచ్చినట్లు తెలవగానే ఫోన్‌లో ఆయనను పరామర్శించాను. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, చిరునవ్వుతో థంబ్స్ అప్ సైగ చేస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైద్యులు చెప్పారు. ఆయన పూర్తిగా కోలుకుని, తర్వగా మళ్లీ ఇంటికి చేరుకోవాలని ప్రార్థిస్తున్నా. ఈ విషయం ఆయన అభిమానులు, శ్రేయభిలాషులందిరితో పంచుకోవటం సంతోషంగా ఉంది” అని తెలిపారు.

Chiranjeevi tweet on Kaikala Satyanarayana health condition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News