Friday, April 26, 2024

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లాలో సోమగూడెంలో గురువారం ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమగూడెం, బెల్లంపల్లి రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని 22 నుండి 25 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేససుకున్నట్లు మంచిర్యాల రైల్వే ఎస్‌ఐ సుదాకర్, హెడ్ కానిస్టేబ్‌లు సురేష్‌గౌడ్ పేర్కొన్నారు. సోమగూడెంలోని కల్వరీ చర్చి వెనక గల రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. యువకుని సమాచారం దొరక లేదని వారు పేర్కొన్నారు. యువకుడు పసుపు రంగు షాట్, క్రీం కలర్ షర్ట్ ధరించి వున్నాడని, మెడలో రెండు తాయత్తులు ఉన్నాయని కుడి చేతిపై ఓం పచ్చ బొట్టు ఉన్నాయని తెలిపారు. మృత దేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్ర పరిచినట్లు వారు పేర్కొన్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో మృతిని వివరాలు తెలియలేదన్నారు. సంఘటన స్థలంలో కానిస్టేబుల్ మహేష్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News